జీఎస్టీ విషయంలో ప్రజలకు మరో చిన్న ఊరట లభించింది. జీఎస్టీ శ్లాబుల విషయంలో ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నిరసన నేపథ్యంలో ఇప్పటికే కొన్నివస్తువుల పన్ను రేట్లను తగ్గించిన కేంద్రం తాజాగా మరికొన్ని వస్తువుల పన్ను రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. అదే జరిగితే ప్రజలకు మరింత ఊరట లభిస్తుంది.
రోజువారీ వినియోగంలో ఉండే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు తదితర వాటిపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇవి 28 శాతం శ్లాబులో ఉన్నాయి. ఫలితంగా వీటి ధరలు సామాన్యులకు అందకుండా పోయాయి. దీంతో వెనక్కి తగ్గిన కేంద్రం వీటిపై పన్ను రేటును తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల 28 శాతం శ్లాబులో ఉన్న 178 వస్తువులపై జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం 50 వస్తువులు మాత్రమే 28 శాతం శ్లాబులో ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 21,2017 08:11AM