హైదరాబాద్ : నగరంలో స్మార్ట్ గౌరవ గృహాల(టాయిలెట్లు)ను ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా వీటిని ఇజ్జత్నగర్ స్లమ్లో ఈ కమ్యునిటీ టాయిలెట్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 12గంటల బ్యాటరీ బ్యాకప్తో కూడిన సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయడంతో విద్యుత్ ఖర్చులు లేకుండానే రాత్రివేళల్లో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉండడం దీని ప్రత్యేకత. అంతేకాదు, కిందిభాగంలో కాంపోస్ట్ పిట్ను ఏర్పాటుచేసి మలమూత్రాలను ఎరువుగా మార్చే ఏర్పాట్లు చేశారు. దీంతో డ్రైనేజీ కనెక్షన్ కూడా అవసరం లేకుండా పోయింది. అంతేకాదు, దివ్యాంగులకు ప్రత్యేకమైన యూనిట్లను తయారు చేశారు. స్టీల్ తలుపులు చిలుము రాకుండా ఉండేలా ప్రత్యేకంగా వాటర్, రస్ట్ ప్రూఫ్గా తయారు చేశారు. అలాగే నీటికారంగా యూనిట్ పాడుకాకుండా ఉండేందుకు పాలియురేతేన్ ఫైబర్తో తయారు చేశారు. ఒక్కో యూనిట్లో పురుషులు, మహిళలకు చెరి నాలుగు చొప్పున టాయిలెట్లు, అలాగే, పురుషులకు ప్రత్యేకంగా నాలుగు యూరినల్స్ ఉండేలా డిజైన్ చేశారు. ఒక్కో యూనిట్ వ్యయం రూ. ఏడు లక్షలుగా ఉన్నట్లు అధికారులు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm