చిత్తూరు : చంద్రగిరి మండలంలో శ్రీవారి మెట్టు అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. 150వ మెట్టు వద్ద 40 మంది తమిళ కూలీలు తారసపడ్డారు. అటవీ అధికారులను చూసి తమిళ కూలీలు పరారయ్యారు. కూలీలు అక్కడే వదిలేసి వెళ్లిపోయిన రూ. కోటి విలువైన ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన కూలీల కోసం అధికారులు, పోలీసులు గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm