పద్మావతి చిత్రానికి సుప్రీం కోర్టులో సోమవారం ఊరట లభించింది. ఈ సినిమా విడుదల పై స్టే విధించేందుకు సుప్రీం నిరాకరించింది. సెన్సార్ పూర్తికాకముందే స్టే ప్రస్తావన ఎలా తెస్తారని పిటిషనర్లను సుప్రీం ప్రశ్నించింది. ఈమేరకు సెన్సార్ బోర్డు వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని, సెన్సార్ పూర్తి కాకుండానే జోక్యం చేసుకోవడం తొందపాటు అవుతుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. రోజులు గడుస్తున్న కొద్దీ సంజయ్ లీలా బన్సాలీ పద్మావతిఁ చిత్ర వివాదం మరింత ముదురుతోంది.
ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, హీరోయిన్ దీపికా పదుకొనేలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ఈ చిత్ర విడుదలను నిషేధించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 21,2017 09:38AM