నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన జెండాపై కపిరాజు చిత్రంలో మెరిసిన కన్నడ భామ రాగిణి ద్వివేది తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుండి ఉంటుంది. తమిళం, మలయాళ భాషలలోను పలు చిత్రాలు చేసింది రాగిణి. తాజాగా ఈ అమ్మడు ముస్సంజె మహేష్ దర్శకత్వంలో ఎం.ఎస్.సి.హెచ్ అనే కన్నడ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో రాగిణి పోలీస్ అధికారి పాత్ర చేస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి మినర్వమిల్లో ఫైటింగ్ సన్నివేశాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఆ సమయంలో సహాయ నటుడు చేయి రాగిణి చెవికి గట్టిగా తగలడంతో ఆమె చెవి నుండి రక్తం దారలుగా కారిందట. వెంటనే ఆమెని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం రాగిణి ఆరోగ్యం మెరుగుపడినట్టు తెలుస్తుండగా, త్వరలోనే మళ్లీ టీంతో కలవనుందట.
Mon Jan 19, 2015 06:51 pm