ముంబయి: బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ బచ్చన్ మీడియా ముందు ఉద్వేగానికి లోనయ్యారు. సోమవారం ఐశ్వర్యతండ్రి కృష్ణారాజ్ రాయ్ జయంతి. ఈ సందర్భంగా తన తండ్రి కోసం ముంబయికి చెందిన స్మైల్ ఫౌండేషన్ ద్వారా గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న 100 మంది చిన్నారులకు సర్జరీ చేయించారు.
ఆ తర్వాత పిల్లలతో కలిసి ఐష్ కాసేపు సరదాగా గడిపారు. అయితే ఐష్ వచ్చారని తెలిసి మీడియా వర్గాలు ఆమె ఫొటోల కోసం గుమిగూడారు. దాంతో ఐష్ ఫొటోలు తీయకండి అంటూ మీడియా ముందు ఉద్వేగానికి లోనయ్యారు.ప్లీజ్ నా ఫొటోలు తీయకండి. నేను ఏ పని కోసం ఇక్కడికి వచ్చానో మీకు తెలీదు. ఇది సినిమా ప్రీమియర్ షో కాదు. పబ్లిక్ ఈవెంట్ అంతకన్నా కాదు. అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు్ణ అంటూ ఐష్ కన్నీరుపెట్టుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 21,2017 12:34PM