పవన్ కల్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసిః చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమా, త్వరలో వారణాసిలో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. వచ్చేనెల 15వ తేదీన ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ఈ ఫంక్షన్ ను అమరావతిఃలో జరపడానికి ప్లాన్ చేస్తున్నారనేది తాజా సమాచారం.
దర్శక నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయానికి పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. పలువురు సినీ ప్రముఖులు .. అభిమానుల సమక్షంలో ఈ వేడుకను వైభవంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారట. అనిరుథ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 21,2017 12:51PM