మహబూబాబాద్: బయ్యారం ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎంపీ సీతారాంనాయక్ డిమాండ్ చేశారు. మూడేళ్లు గడిచిన హామీ అమలులో కేంద్రం వైఖరి సరిగా లేదని విమర్శించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు. త్వరలో నిర్ణయం తీసుకోకుంటే ఆందోళన బాట పట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే బయ్యారం ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. నిర్ణయం తీసుకోకుంటే రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బయ్యారం రైల్వే లైను నిర్మాణానికి రాష్ట్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయినా కేంద్రం నుంచి స్పందన కరువైందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm