పాట్నా: ప్రధానికి వ్యతిరేకంగా ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఆ వేలును నరికేయాలి అని బిహార్ భాజపా అధ్యక్షుడు, ఎంపీ నిత్యానంద్ రాయ్అన్నారు.పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాయ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అవినీతిని, నల్లధనాన్ని, పేదరికాన్ని ప్రధాని మోదీ నిర్మూలించారు. పేదరికం, ఆత్మాభిమానంపై ఎవరైనా వేలెత్తి చూపిస్తే అది ప్రధానికి వ్యతిరేకంగా చూపించినట్లే. అలా ఎవరైనా చేస్తే.. మనమంతా కలిసికట్టుగా ఉండాలి. ఆ వేలును విరగొట్టాలి. అవసరమైతే నరికేయాలి అంటూ రాయ్ వ్యాఖ్యానించారు.
కాగా.. తాను చేసిన వ్యాఖ్యలు సరైనవేనంటూ రాయ్ సమర్థించుకోవడం గమనార్హం. ప్రజలకు అర్థం కాకపోతే.. అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి. అందుకు నేనేం చేయగలను? ప్రజలను సమాధి చేస్తానని కొందరు బెదిరిస్తున్నారు. అంతకంటే ఘోరంగా నేనేం మాట్లాడలేదు కదా.. అని రాయ్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 21,2017 01:25PM