హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పు లేదని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటే అధికార పార్టీతో కలిసినట్లు కాదన్నారు. ఎక్కడ పోరాటం చేయాలో.. ఎక్కడ కలిసి పనిచేయాలో అదే చేస్తామని దత్తాత్రేయ చెప్పుకొచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm