రవితేజ కథానాయకుడిగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఃటచ్ చేసి చూడుః సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. రాశి ఖన్నా .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 60 శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మాస్ .. యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసుకుని, జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. జనవరి 10న ఃఅజ్ఞాతవాసిః .. 12న ఃజై సింహాః ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. గట్టిపోటీ ఉన్నప్పటికీ రవితేజ రంగంలోకి దిగేస్తున్నాడన్న మాట.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 21,2017 02:02PM