న్యూఢిల్లీ: ఢిల్లీ, పంజాబ్ పోలీసులపై కాల్పులకు పాల్పడిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ద్వారకామోర్ మెట్రో పిల్లర్ నంబర్ 768 వద్ద దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 పిస్తోళ్లు, 100 మందుగుండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై నిందితులను విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm