హైదరాబాద్: టీఆర్ఎస్ నేత వల్లభనేని శ్రీనివాస్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 16న రాత్రి సనత్నగర్ బస్టాండ్ వద్ద శ్రీనివాస్ను కొందరు దుండగులు బండరాళ్లతో కొట్టి హత్యచేసిన ఘటన కలకలం రేపింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు షాజిద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాత కక్షలతో పాటు మద్యం మత్తులోనే శ్రీనివాస్ను కొట్టి చంపారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm