తుని: తిరుపతి-విశాఖ మధ్య ప్రయాణించే డబుల్ డెక్కర్ రైలు తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్లో నిలిచిపోయింది. ఈ రైలులో ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. విజయవాడ నుంచి ఏసీ పనిచేయడం లేదని, కొన్నిసార్లు చైన్ రైలు ఆపినప్పటికీ అధికారులు సరిగా స్పందించలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. చివరికి తుని రైల్వేస్టేషన్ చేరుకున్న తర్వాత కొందరు ప్రయాణికులు కిందికి దిగి ఆందోళన చేపట్టడంతో రైలు నిలిచిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm