సిద్దిపేట: పాతకక్షల నేపధ్యంలో ఓ వ్యక్తిని ప్రత్యర్ధులు రాళ్లతో కొట్టిచంపారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం కొండాపూర్లో రొయ్యల మల్లయ్య (35) అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. కాగా... పాతకక్షల నేపధ్యంలో ప్రత్యర్ధులు ఈయన్ను రాళ్లతో కొట్టి చంపారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే హత్యకు పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm