చెన్నై: తమిళనాడులో శశికళ వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఏంకే రెండాకుల గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం స్పష్టతనిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గానికే రెండు ఆకుల గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలోని వర్గాల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు కారణంగా రెండాకుల గుర్తు తమకే కావాలని శశికళ మేనల్లుడు దినకన్ ఎన్నికల సంఘానికి గతంలో అఫిడవిట్లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఈసీ అనేకమార్లు వాయిదాల అనంతరం ఎట్టకేలకు గురువారం స్పష్టతనిచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm