తిరువనంతపురం: నటుడు ప్రకాశ్రాజ్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాడని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటుడు ప్రకాశ్రాజ్ తీవ్రంగా స్పందించారు. భారతదేశ పౌరునిగా ప్రతాప్సింహా చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత జీవితాన్ని కుదిపేశాయని ప్రకాశ్రాజ్ అన్నారు.దీనిపై ప్రతాప్ సింహాకు లీగల్ నోటీసులు జారీ చేశానని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ప్రతాప్ సింహా చేసిన వ్యాఖ్యలపై న్యాయబద్దంగా తనకు సమాధానమివ్వాలని..లేకుంటే ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ప్రకాశ్ రాజ్ హెచ్చరించారు. ప్రకాశ్రాజ్ తన వ్యాఖ్యలతో లెజెండరీ యాక్టర్స్ డాక్టర్ రాజ్కుమార్, ఎన్టీఆర్, ఎంజీఆర్ను గుర్తుకు తెస్తున్నాడని..అయితే ప్రకాశ్రాజ్ కేవలం ఓ సాధారణ నటుడని ప్రతాప్ సింహా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గౌరీలంకేశ్ హత్య, యూపీ ఆస్పత్రిలో చిన్నపిల్లల మరణాలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అంశాలకు సంబంధించి ప్రకాశ్రాజ్ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm