పూజ (30), బల్జీత్ సింగ్ లు భార్యాభర్తలు. బల్జీత్ కనిపించడం లేదంటూ 2016 ఏప్రిల్ 26న అతని సోదరుడు కుల్జీత్ సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తమ అన్న అదృశ్యం వెనుక అన్న బార్య పూజ హస్తం ఉందని వారు అనుమానించారు. వీరి ఫిర్యాదుతో పూజ పేరును ఎఫ్ఐఆర్ లో పోలీసులు ఎక్కించారు. అనంతరం విచారణలో పూజ ఇచ్చిన సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందలేకపోయారు. ఈ క్రమంలో ఓ వైపు పోలీసు విచారణ జరుగుతుండగానే, మరో వైపు తమ వంతుగా ఇంట్లో దర్యాప్తును ప్రారంభించారు కుటుంబసభ్యులు. ఈ నేపథ్యంలో, తమ సోదరుడు హత్యకు గురయ్యాడనే నిజాన్ని వారు గుర్తించారు. పూజను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో నిజాలు వెలుగు చూశాయి. తమ పొరుగునే నివసించే ఓ వ్యక్తితో తనకు శారీరక సంబంధం ఉందని... ఈ నేపథ్యంలోనే, ఇద్దరం కలసి బల్జీత్ ను చంపేశామని ఒప్పుకున్నారు.
పూజ, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని రుజువైందని చెప్పారు. వీరిద్దరికీ 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తున్నట్టు తీర్పును వెలువరించారు. 2016 ఏప్రిల్ లో బల్జీత్ శరీరాన్ని 8 ముక్కలుగా నరికి ఇంట్లోని వివిధ ప్రదేశాల్లో ఆ భాగాలను ఉంచారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 23,2017 04:02PM