న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు.కేంద్రమంత్రులు చౌదరి బీరేందర్సింగ్, సుష్మాస్వరాజ్, హర్దీప్ పూరీతో మంత్రి కేటీఆర్ వరుసగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్కు పోచంపల్లి చేనేత చీరను కేటీఆర్ బహూకరించారు. అరబ్దేశాల్లో తెలంగాణ కార్మికుల సమస్యలను సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరీని కలిశారు. మెట్రో రైలు ప్రారంభ కార్యక్రమానికి రావాలని హర్దీప్పూరీని కేటీఆర్ ఆహ్వానించారు. బీరేందర్ సింగ్తో సమావేశమై బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై చర్చించారు. నెల రోజుల్లో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై టాస్క్ఫోర్స్ తుది నివేదిక అందుతుందని..తుది నివేదిక ఆధారంగా పరిశ్రమ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీనిచ్చారని కేటీఆర్ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm