హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ఎప్పటికైనా జైలుకెళ్లక తప్పదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి ఆరోపణలు అర్థరహితమన్నారు. ఈ నెల 28నుంచి 31వరకు ప్రతిష్టాత్మక సదస్సు జరగనుండటంతో ాకొలువు కొట్లాట్ణ సభకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబంపై, కేటీఆర్ బావమరిది మీద.. రేవంత్ ఆరోపణలు సరికాదని పల్లా చెప్పుకొచ్చారు. రేవంత్ నిత్యం అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm