నాగ్పూర్: విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శుక్రవారం టీం ఇండియా, శ్రీలంక మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. కోట్ రవిశాస్త్రి నేతృత్వంలో టీం ఇండియా క్రికెటర్లు నాగ్పూర్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలి టెస్ట్ డ్రా కావడంతో కోహ్లీ సేన రెండో టెస్టులో శ్రీలంకపై పైచేయి సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. రెండో టెస్ట్ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్ ఆడడం లేదు. వీరి స్థానంలో ఎవరి ఎంపిక చేస్తారో వేచిచూడాలి మరి. శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన అనంతరం.. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా, భారత్ మధ్య 3 టెస్టులు, 6 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm