కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ రెండో రౌండ్లో సైనా నెహ్వల్ ఓటమిపాలయింది. చైనా క్రీడాకారిణి చెన్ యుఫీ చేతిలో 21-18, 19-21, 10-21 తేడాతో సైనా ఓడిపోయింది. అంతకుముందు జరిగిన మహిళ సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 21-19, 23-21తో పౌల్సెన్ (డెన్మార్క్)పై గెలువగా, రెండోసీడ్ సింధు 21-18, 21-10తో లింగ్ యూట్ యి (హాంకాంగ్)ను ఓడించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. అయితే.. సెకండ్ సీడ్ పీవీ సింధు మాత్రం జపాన్కు చెందిన అయా ఒహోరిని ఓడించి మహిళల సింగిల్స్లో క్వార్టర్ఫైనల్స్కు చేరింది. 21-14, 21-17 తేడాతో 39 నిమిషాల్లో సెకండ్ రౌండ్ను సింధు ముగించింది.
Mon Jan 19, 2015 06:51 pm