హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన చేసిన మెట్రో రైల్ను ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారని తెలంగాణ శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. మెట్రో నిర్మాణం ఆలస్యమైనందుకు రూ.3,500 కోట్లు నిర్మాణదార్లకు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. మెట్రో రైలు రెండోదశను ఎంజీబీఎస్ వరకు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఫేజ్ 3లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఎప్పుడు పూర్తి చేస్తారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. మూడో దశ పూర్తయితేనే పాతబస్తీ అభివృద్ధి చెందుతుందన్నారు. అధికారులు మూడో ఫేజ్ లేదంటున్నారని.. దీన్ని చేపట్టడానికి ఎంఐఎం ఒత్తిడి తేవాలన్నారు. లేదంటే కాంగ్రెస్ ప్రజా ఉద్యమం చేపడుతుందని తెలిపారు. బంగారు తెలంగాణ అంటే లిక్కర్, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరకడమేనా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm