హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు ఉదయం యాదాద్రికి వెళ్లనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హెలికాఫ్టర్లో సీఎం యాదాద్రి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు వివాహానికి సీఎం హాజరవుతారు. అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆయన దర్శించుకుంటారు. ఆ తర్వాత యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహింస్తారు. అనంతరం సాయంత్రం 3గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారు.
Mon Jan 19, 2015 06:51 pm