అహ్మదాబాద్ : అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు జరుగుతుందంటూ ఆగంతకుడు ఫోన్ చేయడంతో భద్రతా దళాలు హుటాహుటిన తనిఖీలు నిర్వహించాయి. బాంబు నిర్వీర్య దళం, జాగిలాలు అణువణువూ గాలించాయి. గుర్తు తెలియని ఓ బ్యాగు కలకలం రేపింది. దానిని బాంబు నిర్వీర్య దళం క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఈ బ్యాగు ఉన్న చోటు నుంచి ప్రయాణికులను దూరంగా తరలించారు. అయితే ఈ బ్యాగులో ప్రమాదకరమైనదేదీ కనిపించలేదు.
Mon Jan 19, 2015 06:51 pm