దుబాయ్: టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ ఐసీసీ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో ఐదో స్థానానికి ఎగబాకాడు. మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బాదిన అజేయ ద్విశతకంతో రెండు స్థానాలు మెరుగయ్యాడు. ఈ దెబ్బతో తొలిసారి అతడి ఖాతాలో 800ం రేటింగ్ పాయింట్లు చేరాయి. గతేడాది ఫిబ్రవరిలో రోహిత్ అత్యుత్తమ ర్యాంకైన మూడు సాధించాడు. రోహిత్తో పాటు ఓపెనింగ్కు దిగి శ్రీలంక సిరీస్లో 168 పరుగులు చేసిన శిఖర్ ధావన్ 14వ ర్యాంకుకు చేరుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 876 పాయింట్లతో అగ్రస్థానంలో, దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ (872) రెండో ర్యాంకులో అలాగే కొనసాగుతున్నారు. బౌలర్ల విభాగంలో యజ్వేంద్ర చాహల్ 23 స్థానాలు ఎగబాకి 28, కుల్దీప్ యాదవ్ 16 స్థానాలు ఎగబాకి 56, పాండ్య 10 స్థానాలు మెరుగై 45వ ర్యాంకు సాధించారు. వన్డేల్లో నంబర్వన్గా నిలిచే అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. 3-0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసుంటే అగ్రస్థానంలో ఉండేది. ప్రస్తుతం 119 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm