కర్నూలు: జిల్లాలోని చెన్నంపల్లి కోటలో అపారమైన నిధినిక్షేపాల రహస్యాన్ని చేధించేందుకు వేట సాగుతోంది. ఐదు రోజులుగా అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. తవ్వకాల్లో సీసము టెంక బయటపడడంతో... గుప్త నిధి ఉందన్న అనుమానాలకు మరింత బలం చేకూరింది. కర్నూలు జిల్లా చెన్నంపల్లిలో ఆరు వందల ఏళ్ల చరిత్ర కలిగిన కోటలో అపారమైన నిధి నిక్షేపాల రహస్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. గత ఐదు రోజుల నుంచి చెన్నంపల్లి కోటలో ప్రభుత్వ అధికారులు జరుపుతున్న తవ్వకాలు చివరి దశకు చేరుకున్నాయి. ఐదో రోజు తవ్వకాల్లో పది అడుగులు తవ్వాక అధికారులు అనుకున్నట్లుగా సీసము టెంకము బయట పడింది. దీంతో గుప్త నిధి ఉందనే అనుమానాలకు మరింత బలం చేకూరింది. సీసము టెంకము కింది బాగంలో మరో పెద్ద బండరాయి బయల్పడింది. తవ్వకాలు జరుపుతున్న ప్రదేశంలోని పెద్ద పెద్ద బండ రాళ్లపై ఉన్న మ్యాప్ను సూచించే గీతల ఆధారం చేసుకుని అధికారులు వజ్ర నిక్షేపాలు బయటపడేంత వరకూ తవ్వకాలు జరపాలని నిశ్చయించుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm