హైదరాబాద్: ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సమావేశానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చిన నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఇప్పటికే అటవీశాఖ మొదటి, రెండవ దశ అనుమతులు సాధించిన ప్రజెక్టుకు ఇప్పటి వరకు అతి కీలకమైన పర్యావరణ అనుమతులు వచ్చాయి. ఇది తెలంగాణ ప్రజల గొప్ప విజయంగా తెలిపారు. పర్యావరణ అనుమతి సాధించడంతో ప్రాజెక్టు అతి కీలకమైన మైలురాయిని దాటింది. పర్యావరణ అనుమతులు రావడాన్ని సానుకూలంగా తీసుకుని ద్విగుణీకృత ఉత్సాహంతో అధికారులు పనిచేయాలి. దశాబ్దాల తరబడి ఎదుర్కొన్న సాగునీటి కష్టాలను దూరం చేయడానికి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు
Mon Jan 19, 2015 06:51 pm