కేతేపల్లి, సూర్యాపేట : మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. యాసంగి సాగుకోసం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని కుడి కాల్వకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, సూర్యాపేట జిల్లా సోలిపేట వద్ద ఎడమ కాలువకు నీటి పారుదల ఈఈ సంజీవరెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నీటిని తీసుకువచ్చి మూసీని శాశ్వత రిజర్వాయర్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్టు పరిధిలోని ప్రభుత్వ భూమిలో పర్యాటక కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm