వరంగల్ : ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన హన్మకొండ లష్కర్బజార్లోని ప్రభుత్వ బీఎడ్ కళాశాల ఎదుట చోటు చేసుకుంది. హన్మకొండ పోలీసుల తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన అన్నం శ్రీకాంత్, తోట అరుణ్ బీటెక్ పూర్తి చేసి నయీంనగర్లో రూమ్లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. హన్మకొండ బస్టాండ్కు వెళ్లి టీ తాగి వస్తామని స్నేహితుని బైకు తీసుకొని ఇద్దరు వెళ్లారు. ఈ క్రమంలో లష్కర్బజార్లో డివైడర్ మధ్యలోఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొని అక్కడికి అక్కడే ప్రాణాలు విడిచారు. శ్రీకాంత్ సోదరుడు అన్నం రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm