హైదరాబాద్ : ప్రపంచాన్ని మార్చే శక్తి అక్షరానికి, పుస్తకానికి ఉంది. అలాంటి అక్షర జ్ఞానాన్ని అందరికీ పంచుతూ కవులు కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు ఇలా అందరినీ ఏకం చేసే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన-2018 నేటి నుండి ప్రారంభం కానుంది. నేటి నుండి 11 రోజుల పాటు జరిగే పుస్తక ప్రదర్శన, ఇతర కార్యక్రమాలకు పనులు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా దేశంలో 12 రాష్ర్టాల నుండి వస్తున్న నిర్వాహకుల కోసం 231 స్టాల్స్ ఏర్పాటు చేశారు. పుస్తక ప్రదర్శనలో ప్రతి రోజు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు భాగ్యారెడ్డి వర్మ ప్రాంగణం, సినారె వేదిక పేరుతో విశాలమైన స్థలాన్ని కేటాయించి వేదికను ఏర్పాటు చేశారు. అలాగే రచయితల, ఆయా సంస్థల కొత్త రచనలను ఆవిష్కరించుకునేందుకు, సాహిత్య కార్యక్రమాల కోసం సామాల సదాశివ ప్రాంగణం బోయ జంగయ్య సాహిత్య వేదిక పేరుతో ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm