హైదరాబాద్ : 2018-19 ఏడాదికి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామాంతపూర్, బేగంపేట)లలో ఒకటవ తరగతిలో ప్రవేశాల కోసం గిరిజన బాల, బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్టీ వెల్ఫేర్ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. సదరు అభ్యర్థ్ధులు 2012, జనవరి నుంచి 31 మే 2013 మధ్య జన్మించిన వారై ఉండాలని ప్రకటనలో సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలని తెలిపారు. సక్తి గల అభ్యర్థులు సంబంధిత ధ్రువ పత్రాలతో ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా ఎస్టీ వెల్ఫేర్ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించుకోవాలని అన్నారు. ప్రవేశాలకు సంబంధించి జిల్లా వాసులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. జిల్లా గిరిజన శాఖ అధికారులచే స్పాన్సర్ చేయబడిన విద్యార్థులకు మాత్రమే స్కాలర్షిప్లు మంజూరు చేయబడతాయని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm