హైదరాబాద్: సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత కాశీనాథ్ గురువారం ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని శ్రీ శంకర హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. కన్నడ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాశీనాథ్ చివరగా చౌక సినిమాలో నటించారు. కన్నడ సినీ ప్రముఖులు ఉపేంద్ర, వి.మనోహర్ లాంటి వారికి గాఢ్ ఫాదర్గానూ కాశీనాథ్ గుర్తింపు తెచ్చుకున్నారు. డబుల్ మీనింగ్ డైలాగ్ లతో ఫేమస్ అయిన కాశీనాథ్ పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగానూ పని చేశారు. పదికి పైగా చిత్రాలను నిర్మించిన ఆయన దాదాపు 40 చిత్రాల్లో నటించారు. ఆయన తనయుడు అభిమన్యు ప్రస్తుతం కన్నడ సినీరంగంలో నటుడిగా కొనసాగుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm