ఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలకు సీఈసీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు గురువారం ఎన్నికల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పరిమితి రూ. 20లక్షలు విధించారు. ఫిబ్రవరి 18న త్రిపురలో..ఫిబ్రవరి 27న మేఘాలయ, నాగాలాండ్ లో ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 6తో మేఘాలయ శాసనసభా కాలం...మార్చి 13తో నాగాలాండ్ శాసనసభా కాలం..మార్చి 14తో త్రిపుర శాసనసభ కాలం ముగియనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm