హైదరాబాద్: చార్మినార్లో పాదచారుల ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్న కారణంగా చార్మినార్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆరు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ వీవీ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చార్మినార్ చుట్టు పక్కల నుంచి వచ్చే వాహనాలకు అనుమతి లేదు. వాటిని ఆయా మార్గాలలో మళ్లిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ ఆంక్షలు జూన్ 14వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm