చిత్తూరు: ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలంటూ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు గురువారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. టవర్ క్లాక్ వద్ద చుట్టూ గోడను నిర్మించి అందులో నిలబడి, ఇసుకతో భుజాల వరకు నింపుకొని సమాధి రీతిలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్బంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ... తెలుగు జాతి ఔన్నత్యాన్ని, కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన మహానటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు మృతిచెంది 22 సంవత్సరాల గడుస్తున్నా భారతరత్న ప్రకటించకపోవడం తెలుగు జాతికి తీరని అవమానమనన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారు సుధాకర్, మొండికాల్వ నాగరాజు నాయుడు, గ్యాస్ నాగరాజు, బాలాజీ నాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm