బెంగళూరు : బెంగళూరుకు చెందిన ఓ మహిళ తనపై రేప్ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఎవరో ఒక వ్యక్తి తనను అడ్రస్ అడిగేందుకని వచ్చి కారులోకి లాక్కెళ్లాడని, ఆ కారులో ఓ ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, కారును రోజంతా నగరం చుట్టూ తిప్పుతూ తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ మహిళ పేర్కొంది. దీంతో మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా ఆ మహిళ అసలు గుట్టు బయటపడింది. అసలు, ఆ మహిళపై అత్యాచారం జరగలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే, ఆ మహిళ ఇలా ఫిర్యాదు ఇవ్వడానికి గల కారణం ఏమిటా..? అని ఆరా తీయగా.. తనకు తన భర్త అంటే ఇష్టం లేదని, పెళ్లికి ముందు ఓ వ్యక్తిని ప్రేమించానని చెప్పింది. దీంతో తనకు ఇష్టంలేని వ్యక్తితో.. తమ పెద్దలు పెళ్లిచేశారని చెప్పుకొచ్చింది. తనపై అత్యాచారం జరిగిందని చెప్పితే భర్త వదిలేస్తాడు అని అందుకే ఈ నాటకం ఆడాని పోలీసులకు చెప్పుకొచ్చింది. ఆ మహిళ చెప్పిన మాటలు విన్న పోలీసులు అవాక్కయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm