చిత్తూరు: విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్కు విమానంలో బయల్దేరారు. ప్రజాసంకల్పయాత్ర పేరిట ఆయన నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం శ్రీకాళహస్తి వరకు కొనసాగింది. అయితే... రేపు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉన్న నేపధ్యంలో ఆయన విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm