ముంబై: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యహూ, ముంబై దాడుల బాధిత బాలుడు మోషే హోల్ట్బర్గ్ ముంబైలో కలుసుకున్నారు. నారీమన్ హౌజ్లో ఆ ఇద్దరూ భేటీ అయ్యారు. 2008లో జరిగిన ఉగ్రదాడిలో మోషే తన పేరెంట్స్ను కోల్పోయాడు. అప్పుడు ఆ పిల్లోడి వయసు రెండేళ్లు. యూద కుటుంబానికి చెందిన ఆ పిల్లోడు ఇజ్రాయెల్లో తన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగాడు. ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వాత భారత్కు వచ్చాడు. ఇజ్రాయల్ ప్రధాని నెతన్యహూ రాక సందర్భంగా మోషే కూడా ఇండియాకు వచ్చాడు. నారీమన్ హౌజ్ వద్ద స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా అక్కడికి మోషే వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ ఆ బాలుడిని కలుసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm