వికారాబాద్: జిల్లాలోని యాలాల్ మండలం లక్ష్మినారాయణపూర్ క్రాస్రోడ్డులో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 105 కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధరలు అందిస్తున్నట్లు చెప్పారు. రైతాంగం సంతోషించే చర్యలు చేపట్టిన ప్రభుత్వం తమదన్నారు. రూ. 40 వేల కోట్ల రుణమాఫీ చేయడంతో పాటు 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎకరాకు రూ. 4 వేల పెట్టుబడిని రెండు పంటలకు అందివ్వబోతున్నట్లు మ్రంత్రి వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm