న్యూఢిల్లీ: ఉగ్రవాదులు నిధులు అందజేస్తున్న కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. మొత్తం 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాయిద్దున్ చీఫ్ సయీద్ సలాహుద్దీన్ పేర్లను కూడా తాజాగా ఆ కేసులో చేర్చారు. కశ్మీర్ వ్యాలీలో హింసను ప్రేరేపించేందుకు ఉగ్రవాదులు నిధులు సమీకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని కోర్టులో ఎన్ఐఏ సుమారు 1279 పేజీల ఛార్జ్షీట్ను తయారు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పది మందిని జ్యుడిషయల్ కస్టడీ కింద అరెస్టు చేశారు. ఉగ్రవాదులు నిధులు చేరవేస్తున్నారన్న అంశంలో ఎన్ఐఏ మొత్తం 60 లొకేషన్లలో తనిఖీలు చేపట్టింది. అక్కడ నుంచి సుమారు 950 డాక్యుమెంట్ల సమాచారాన్ని సేకరించారు. ఈ కేసులో మొత్తం 300 మంది సాక్షులు కూడా ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm