ముంబైః సౌతాఫ్రికా టూర్ ముగియగానే టీమిండియా మరోసారి శ్రీలంక ైఫ్లెటెక్కనున్నది. శ్రీలంక 70వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని అక్కడ ఓ ముక్కోణపు సిరీస్ ఆడటానికి బీసీసీఐ ఓకే చెప్పింది. ఈ ట్రై సిరీస్లో ఇండియా, శ్రీలంకతోపాటు బంగ్లాదేశ్ ఆడనుంది. మార్చి 6 నుంచి మార్చి 18 వరకు ఈ నిదహాస్ ట్రోఫీ జరుగుతుంది. ఈ సిరీస్లో భాగంగా ప్రతి టీమ్ మిగతా రెండు టీమ్స్తో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. టాప్ రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే అన్ని మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లను డీస్పోర్ట్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత ఉపఖండంలో జరిగే టోర్నీల కోసమే డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా ఈ టీవీ చానెల్ను లాంచ్ చేసింది. తొలిసారి ఇండియా పార్టిసిపేట్ చేసే ఇంటర్నేషనల్ టోర్నీని డీస్పోర్ట్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది.
శ్రీలంక ట్రై సిరీస్ షెడ్యూల్ ఇదీ..
మార్చి 6: శ్రీలంక vs ఇండియా
మార్చి 8: బంగ్లాదేశ్ vs ఇండియా
మార్చి 10: శ్రీలంక vs బంగ్లాదేశ్
మార్చి 12: ఇండియా vs శ్రీలంక
మార్చి 14: ఇండియా vs బంగ్లాదేశ్
మార్చి 16: బంగ్లాదేశ్ vs శ్రీలంక
మార్చి 18 : ఫైనల్
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 18,2018 06:55PM