హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ మైదానంలో 31వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ పుస్తక ప్రదర్శనలో 350కి పైగా స్టాళ్లు కొలువుదీరాయి. నేడు ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శన ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. పుస్తక ప్రదర్శనలో ప్రతి రోజు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు భాగ్యారెడ్డి వర్మ ప్రాంగణం, సినారె వేదిక పేరుతో విశాలమైన స్థలాన్ని కేటాయించి వేదికను ఏర్పాటు చేశారు. అలాగే రచయితల, ఆయా సంస్థల కొత్త రచనలను ఆవిష్కరించుకునేందుకు, సాహిత్య కార్యక్రమాల కోసం సామాల సదాశివ ప్రాంగణం బోయ జంగయ్య సాహిత్య వేదిక పేరుతో ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm