హైదరాబాద్ : జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బృందం రెండో రోజూ పర్యటించింది. షిజ్వోకా రాష్ట్ర పరిపాలనాధికారులను, పలువురు ప్రముఖ పెట్టుబడిదారులను కలిసారు. ఈరోజు ఉదయం మంత్రి కేటీఆర్ సుజుకి మోటార్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒసాము సుజికితో సమావేశమయ్యారు. ఆటోమొబైల్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా పరిగణిస్తుందని, ఈ రంగంలో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులను సుజుకి చైర్మన్ కు కేటీఆర్ వివరించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, టీఎస్ ఐపాస్, సింగిల్ విండో అనుమతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా టీఎస్ ఐపాస్ విధానంపై సుజుకి ప్రశంసలు కురిపించారు. కాగా, షిజ్వోకాలో ఉన్న సుజుకి మ్యూజియాన్ని మంత్రి బృందం సందర్శించింది. అనంతరం, షిజ్వోకా రాష్ట్ర గవర్నర్ కవాకాస్తు హైటాతో మంత్రి బృందం సమావేశమైంది.
Mon Jan 19, 2015 06:51 pm