న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టుల పూర్తికి ఆర్థిక చేయూత నివ్వాల్సిందిగా కేంద్ర ఆర్థికమంత్రిని కోరినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఢిల్లీలో నేడు జరిగిన జీఎస్టీ మండలి సమావేశం ముగిసింది. భేటీలో పాల్గొన్న మంత్రి ఈటల సమావేశం అనంతరం వివరాలను వెల్లడించారు. కేంద్ర బడ్జెట్కు సంబంధించి రాష్ర్టాల అభిప్రాయాలను జైట్లీ అడిగినట్లు తెలిపారు. కాగా ప్రభుత్వం చేపట్టిన కొత్త పథకాలు, ఆవిష్కరణలకు మద్దతివ్వాలని రాష్ట్రం తరపున అడిగినట్లు చెప్పారు. వ్యవసాయ రంగానికి అదేవిధంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm