హైదరాబాద్: సినీ క్రిటిక్ కత్తి మహేష్ కారుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్ల దాడికి పాల్పడ్డారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, కత్తి మహేశ్ మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొని వెళుతుండగా కొండాపూర్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పవన్ కల్యాణ్ అభిమానులే దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే కత్తి మహేశ్ ఈఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm