హైదరాబాద్: ఏపీ విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ప్రజాసంకల్పయాత్ర పేరిట జగన్ ప్రస్తుతం ఏపీలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుండగా గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి విమానంలో హైదరాబాద్కు బయలుదేరారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm