హైదరాబాద్: నగరంలోని చంపాపేట్లో శుక్రవారం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంపాపేట్ పోచమ్మ బస్తీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని, కొంతమంది నాయకులు తమ స్వార్ధంతో పార్టీని వీడినా కార్యకర్తలు అధైర్యపడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తూళ్ల విజయ్, ఎల్బీ నగర్ ఇంచార్జి సామా రంగారెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm