హైదరాబాద్: జనసేన అధినేత, సినీహీరో పవన్కల్యాణ్ దిష్టిబొమ్మను ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం దహనం చేశారు. కత్తి మహేష్ పై కోడిగుడ్లతో దాడిని నిరసిస్తూ పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా... అదే సమయంలో పవన్కల్యాణ్ అభిమానులు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జై జనసేన, జై పవన్ కల్యాణ్ అంటూ వారు నినాదాలు చేశారు. అయితే... పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm