విజయవాడ: రైల్వేస్టేషన్ లో యాత్రికులు ఆందోళనకు దిగారు. భారతీ దర్శన్ పేరుతో వృద్ధుల కోసం రైల్వేశాఖ ఓ ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది. అయితే... బోగీల్లో సదుపాయాలు లేవంటూ యాత్రికుల నిరసనకు దిగారు. దీంతో రెండుగంటలపాటు రైలు నిలిచిపోయింది. తీర్థయాత్రల కోసం ఐఆర్టీసీ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటుచేసినప్పటికీ బోగీల్లో సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm